నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో కరెంటు షాక్ ప్రాణాంతకంగా మారింది. సారిక (30) అనే మహిళ తన పంట పొలంలో పనులు చేస్తుండగా విద్యుత్ తీగ తగలడంతో షాక్తో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.
అక్కడ ఉన్న విద్యుత్ స్తంభానికి ఉండే తీగకు అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో సారిక మరణించింది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కరెంటు ఈ విధంగా అకస్మాతుగా రావడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.