డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. సైకో చేతిలో ఒక మహిళ మృతి చెందగా, మరో మహిళ తీవ్ర గాయాలపాలైయింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం అమలాపురంలోని మున్సిపల్ ఏఎంజీ కాలనీలో మంగళవారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో ఇంటి పని చేసుకుంటుండగా వెనుక నుంచి వచ్చిన సైకో చాకుతో మహిళ పీక కోశాడు. అక్కడే ఉన్నన ఇంటి యజమాని పైకూడా దాడి చేసి మరో మహిళ వీపుపై చాకుతో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి.
మృతి చెం దిన మహిళ పేరు మన్నె శ్రీదేవిగా (28) పోలీసులు గుర్తించారు. గాయపడిన మహిళ కమ్మిడి వెంకటరమణ(45) గుర్తించారు. వెనుక నుంచి వచ్చి చాకుతో శ్రీదేవి పీక కోయడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. తీవ్ర గాయాలతో మరో మహిళ వెంకటరమణ అమలా పురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. మహిళలపై దాడిచేసిన సైకో అతని వద్దనున్న కార్డుల ఆధారంగా నెల్లూరు వాసిగా స్థానికులు గుర్తించారు. దాడి చేసిన సైకో పూర్తిగా మతి స్తిమితం లేకుండా ఉండడంతో అతన్ని పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించారు. సైకోను పట్టుకునే సమయంలో కూడా స్థానికులపై దాడికి తెగబడ్డాడు. ఈ సంఘటనపై అమలాపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.