నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ ఫేస్ బుక్ హ్యాకింగ్ కు గురైంది. ఆయన ఫేస్ బుక్ ఎకౌంట్ సాయంతో హ్యాకర్లు కొందరు మహిళల నుంచి డబ్బులు వసూలు చేశారు.
రంగనాథ్ ఆవుల వెంకట పేరుతో పలువురికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి డబ్బులు వసూలు చేయడం సంచలనం సృష్టించింది. తన భార్య అకౌంట్ కి 20,000 వేయాలంటూ ఎస్పీ పెట్టినట్లుగా మెసేజీలు పంపారు.
విషయం తెలిసి ఎస్పీ రంగనాథ్ షాక్ తిన్నారు. ప్రస్తుతం రిక్వెస్టులు పంపుతున్న అకౌంట్ ను తాను రెండు సంవత్సరాల కిందట ఆపరేట్ చేయడం మానేసినట్లు ఎస్పీ చెప్పారు.
తన పేరుతో వచ్చే మెసేజీలకు ఎవరు డబ్బులు పంపొద్దు అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. సైబర్ క్రైమ్ అధికారులు ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నరు.