ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు కు సంబంధించిన అంశాలపై సీబీఐటీ నిపుణులు అల్వాల్ లోని లయోలా అకాడమీ విద్యార్ధులకు ఆన్ లైన్ సెమినార్ నిర్వహించారు. సాంకేతికత ద్వారా సహజమైన భాష ప్రక్రియ (ఎన్ఎల్ పి)విధానంపై సిబిఐటి కళాశాల సీనియర్ అధ్యాపకుడు డాక్టర్ జిఎన్ఆర్ ప్రసాద్ ప్రసంగించారు. ఎన్ఎల్పిలో వివిధ అప్లికేషన్ల గురించి ఆయన వివరించారు.
చాట్బాట్ కు సంబంధించిన విధానాలను ఆయన వివరించారు. ఎన్ఎల్పిలో పరిశోధన అవకాశాల గురించి కూడా ఆయన వివరించారు. ఎన్ఎల్ పి మానవ భాషలను అర్థం చేసుకోవడానికి, ప్రతిస్పందించడానికి కంప్యూటర్లను అనుమతిస్తుంది. ఇది మొత్తం వినియోగదారుడు అనుభవాలు వ్యాపారవేత్త కు ఆందజేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమానికి లొయోల అకాడెమి కంప్యూటర్ సైన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగధిపతి డి.అర్పితా రాణి అధ్యక్షతన వహించారు.