చలన చిత్ర పరిశ్రమ చావుదెబ్బ కొట్టేందుకు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం మొదలు పెట్టినట్లు కనిపిస్తున్నది. రైల్వే టిక్కెట్ల ఆన్ లైన్ టికెటింగ్ సిస్టమ్ విధానం మాదిరిగా సినిమా టికెట్ల బుకింగ్ కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ ను ప్రభుత్వం రూపొందిస్తున్నది.
ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టికెట్ల బుకింగ్ పోర్టల్ ను పర్యవేక్షించనున్నది. విధి విధానాలు, అమలు ప్రక్రియ కోసం ప్రత్యేక కమిటీని ప్రభుత్వం నియమించింది.
ఈ సినిమా టిక్కెట్ బుకింగ్ పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఇక నుంచి ఏ సినిమా విడుదల అయినా సరే వచ్చిన కలెక్షన్లు మొత్తం ప్రభుత్వం తీసేసుకుంటుంది. ప్రతి నెలా 30 వ తారీఖున ప్రొడ్యూసర్స్ కి, డిస్ట్రిబ్యూటర్లకు వాళ్ళ వాటాను ప్రభుత్వం ఇస్తుంది. అప్పటిదాకా డబ్బులన్నీ ప్రభుత్వం దగ్గరే వుంటాయి.