రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది రివర్స్ టెండర్ కాదు,రిజర్వు టెండర్ అని కడప జిల్లా రాజంపేట టీడీపీ ఇంచార్జీ భత్యాల చెంగల రాయుడు అన్నారు. టీడీపీ కార్యాలయం లో మంగళవారం నాడు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైన్, మైన్, ల్యాండ్, శాండ్ తో సహా అవినీతి లో కూరుకుపోయిందని అన్నారు. కొత్తగా స్కీములతో స్కాములు చేస్తున్నారని ఆరోపించారు.
108 లో 307 కోట్ల ప్రజా ధనం దోపిడీ జరిగిందని, కాల పరిమితి ఉన్న జీ. వి.జి.ని కాదని విజయ సాయి రెడ్డి వియ్యంకుడు అరవిందో ఫౌండేషన్ రాం ప్రసాద్ రెడ్డి కి కాంట్రాక్టు కట్టబెట్టారని ఆరోపించారు. ఇంకా ఈ సమావేశంలో టి.యన్.టి.యుసి.అధ్యక్షుడు మన్నూరు రాజా, టీడీపీ నేతలు సుబ్రహ్మణ్యం నాయుడు, సంజీవ రాయుడు తదితరులు పాల్గొన్నారు.