శ్వాసకోశ సమస్యలతో కేంద్ర హోం శాఖ మంత్ ఎయిమ్స్లో చేరారు. ఇటీవల కరోనా సోకడంతో ఆయన గురుగ్రామ్ మేదాంత ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే.
ఆగస్టు 2న కొవిడ్ సోకడంతో వైద్యుల సూచన మేరకు ఆయన ఆస్పత్రిలో చేరారు. మరోసారి పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్టు ఈనెల 14న అమిత్ షా ట్వీట్ చేశారు.
తాజాగా శ్వాసకోశ సమస్యతోపాటు రెండు మూడు రోజులుగా ఒంటి నొప్పులు రావడంతో ఆయన ఎయిమ్స్లో చేరినట్లు వైద్యులు తెలిపారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలో అమిత్ షాకు చికిత్స అందిస్తున్నారు.