40.2 C
Hyderabad
May 2, 2024 18: 49 PM
Slider ముఖ్యంశాలు

ఆరంజ్ ట్రావెల్స్ కు తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

orange travels

సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం సమీపంలో ఆరంజ్ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. బస్సులో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరగడంతో బస్సు మొత్తం కాలిపోయింది. ఆ సమయంలో బస్సులో మొత్తం 26 మంది ప్రయాణీకులు  ఉన్నారు.

అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ హాని గానీ, గాయాలుగానీ కాలేదు. అక్కడి నాగులమ్మ గుడి దగ్గరకు రావడంతో బస్సులో  విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయింది. ఆ సమయంలో ఆరంజ్ ట్రావెల్స్ డ్రైవర్ అనీల్ రెడ్డి బస్సు నడుపుతున్నాడు.

ముంబై నుంచి హైదరాబాద్ కు వస్తుండగా కొద్ది సేపటిలో హైదరాబాద్ చేరతామనగా ఈ ప్రమాదం సంభవించింది. బస్సు మొత్తం దగ్ధం అయింది. ఫైర్ సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. ప్రయాణీకుల సామాన్లు మొత్తం మంటల్లో కాలిపోయాయి.

Related posts

రాజ్యాంగాన్ని మార్చే హక్కు సీఎం కేసీఆర్ కు లేదు

Satyam NEWS

విజయనగరం పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు చర్యలు

Satyam NEWS

బిక్కు బిక్కు మంటున్న లంక గ్రామాల ప్రజలు

Satyam NEWS

Leave a Comment