సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం సమీపంలో ఆరంజ్ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. బస్సులో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరగడంతో బస్సు మొత్తం కాలిపోయింది. ఆ సమయంలో బస్సులో మొత్తం 26 మంది ప్రయాణీకులు ఉన్నారు.
అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ హాని గానీ, గాయాలుగానీ కాలేదు. అక్కడి నాగులమ్మ గుడి దగ్గరకు రావడంతో బస్సులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయింది. ఆ సమయంలో ఆరంజ్ ట్రావెల్స్ డ్రైవర్ అనీల్ రెడ్డి బస్సు నడుపుతున్నాడు.
ముంబై నుంచి హైదరాబాద్ కు వస్తుండగా కొద్ది సేపటిలో హైదరాబాద్ చేరతామనగా ఈ ప్రమాదం సంభవించింది. బస్సు మొత్తం దగ్ధం అయింది. ఫైర్ సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. ప్రయాణీకుల సామాన్లు మొత్తం మంటల్లో కాలిపోయాయి.