వైసీపీ పాలనలో పేదల కోసం ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ ప థకాలు పేద ప్రజల ఇంటి తలుపులు తడుతున్నాయని అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఆకేపాడు. గ్రామ సర్పంచ్ ఆకేపాటి మురళిరెడ్డి లు తెలిపారు.
ఈ రోజు రాజంపేట మండలం మందపల్లి పంచాయతీలోని వడ్డిపల్లి, శేషమాంబ పురం వంచాయ తీలోని బాలిరెడ్డి గారిపల్లె, కోపురాజువల్లె గ్రామాల్లో గడపగడపకు మనప్రభు త్వం కార్యక్రమాన్ని నిర్వహించి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం అభ్యున్నతే ధ్యేయంగా జగనన్న ప్రభుత్వం పని చేస్తుందని ఇందులో భాగంగా సంక్షేమ పథకాలను పేద బడుగు బలహీన వర్గాల వారి అందరి ఇళ్లకు చేరాయా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు మూడు సంవత్సరాల పాలన ముగి రు.
సిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్ర -మాన్ని ప్రవేశపెట్టి ఎమ్మెల్యే నుంచి వాలంటీర్ వరకు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేవిధంగా చర్యలు చేపట్టారని చెప్పారు. ఇందులో భాగం గానే తాము ఈరోజు మీ గ్రామాల్లోకి పర్యటించి ప్రతి ఇంటిని సందర్శించి జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాల్లో భాగంగా అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనే విషయాలను స్వయంగా తెలుసుకుంటున్నామని చెప్పారు.
ఇంకా ఎవరికైనా సంక్షేమ పథకాలు అంద కుండా ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకు రావాలని చెప్పారు. అదేవిధంగా మీ గ్రామాల్లో ఏవైనా గడప గడపకు తీసుకెళ్లి ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యవంతులను చేశారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో బాలి రెడ్డి గారి పల్లి కోపురాశి పల్లి ప్రజలు తమ గ్రామంలో రహదారులు విద్యుస్తంభాలు కావాలని ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు.
తప్పకుండా ఈ సమస్యలను పరిష్కరిస్తామని వారికి ఎంపీ హామీ ఇచ్చారు. అనంతరం కొందరు వృద్ధులు తమకు వృద్ధాప్య పించను మంజూరు కాలేదని ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎంపీ మిథున్ రెడ్డి ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్రెడ్డి జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డిలు వెంటనే పింఛను మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఆకేపాటి మురళి రెడ్డి జెసిబి సుబ్బారెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.