శార్వానంద్, సిద్దార్ధ్ మీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం మహా సముద్రం. దీపావళి పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ పోస్టర్ ను విడుదల చేసింది.
కళాత్మకంగా ఉన్న ఈ పోస్టర్ విడుదల అయిన క్షణం నుంచి ట్రెండింగ్ లో ఉంది. ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకుడు.
అదితీరావు హైదిరి, అను ఇమాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాబోతున్నది.