37.2 C
Hyderabad
May 2, 2024 13: 15 PM
Slider నల్గొండ

గరిడేపల్లి మండల కేంద్రంలో ఓజో ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు

#ozofoundation

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండల కేంద్రంలో పలు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారిని కలిసి తనవంతు సహాయం చేస్తానని ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు హమీ ఇచ్చారు.

రఘన్న చేయూతలో భాగంగా సోమవారం కొంతమందికి ఆర్థిక సాయం చేయడంతో పాటు మరికొంత మందికి నేనున్నానని ధైర్యం చెప్పడం చెప్పారు. రాబోయే రోజుల్లో ఒక అవకాశం ఇచ్చి చూడండని,మీకు ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్న తానే దగ్గర ఉండి మండల కేంద్రంలో మంచి హాస్పిటల్ నిర్మించి ఉచిత సేవ అందిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ముందుకెళ్తానని దీనికి తోడు ప్రతి సంవత్సరం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉచిత కోచింగ్ అందిస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా మండల నర్సమ్మ, నాగిరేని ముత్తయ్య,రావుల నర్సమ్మ, మేకపోతుల చెన్నయ,బొమ్మరాళ్ల జానకమ్మ,అమరావతి బజారమ్మ, బచ్చలకూరి తిరుపతమ్మ మున్నగు వారిని పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఇంచార్జ్ కుక్కల వెంకన్న,గరిడేపల్లి మండల ఓజో ఫౌండేషన్ సభ్యులు,పలు గ్రామాల సభ్యులు గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

కరెంటు షాక్ తో ముగ్గురు యువకులు మృతి

Satyam NEWS

చెరువులో పడి ఇద్దరు యువకుల మృతి

Satyam NEWS

సింగరేణి కార్మికులకు త్వరలో వేజ్ బోర్డు ఏరియర్స్

Bhavani

Leave a Comment