29.7 C
Hyderabad
May 2, 2024 05: 39 AM
Slider నిజామాబాద్

చెరువులో పడి ఇద్దరు యువకుల మృతి

kamareddy deaths

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టెక్రియల్ గ్రామంలో విషాదం నెలకొంది. గేదెలు మేపడానికి వెళ్లిన ఇద్దరు యువకులు చెరువులో పడి మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మద్దికుంట రణదీప్(18) మద్దికుంట శేఖర్(18) లు రోజు మాదిరిగానే ఈ రోజు కూడా గేదెలను మేపడానికి వెళ్లారు.

చెరువులో నీళ్లు తాగడానికి వెళ్లిన గేదెలు ఎంత సేపటికి బయటకు రాకపోవడంతో ఇద్దరు యువకులు బట్టలు విప్పి గేదెలను బయటకు తీసుకురావడానికి చెరువులోకి దిగారు. అయితే చెరువులో గుంత ఉండటంతో అందులో పడి ఇద్దరు మృతి చెందారు. ఇద్దరికి కూడా ఈత రాకపోవడంతో ఇద్దరు మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు చెరువులోకి దిగి ఇద్దరి మృతదేహాలను బయటికి తీశారు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.

Related posts

విజ‌య‌న‌గ‌రం జిల్లా నేర స‌మాచారం క్రైమ్ ఫ‌టాఫ‌ట్..ఓ సారి చూడండి !

Satyam NEWS

షారూఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమా పై ముదిరిన వివాదం

Satyam NEWS

విద్యార్థులు తినే భోజనంపై రాజకీయాలు చేయడం దుర్మార్గం

Satyam NEWS

Leave a Comment