విజయనగరం ఇలవేల్పు, ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీశ్రీశ్రీ పైడతల్లి అమ్మవారి సిరిమాను సంబరం..భక్తుల సందడి లేకుండా సాదాసీదాగా ముగిసింది మూడు సార్లు మూడులాంతర్లు వద్ద నుంచీ కోట గుమ్మం వరకు సాగింది.
ఈ సంబరంలో విశేషాలు.
* సరిగ్గా ఒంటిగంటకు…కర్రల దండు వచ్చింది.
*1.15 కు హుకుంపేట నుంచీ సిరిమాను అమ్మవారి కోవెలకు వచ్చింది.
* 02.25 జాలరి వల ,2.40 ఏనుగు రధం…3.10 అంజలి రథం వచ్చాయి.
* 03.40 పూజారి చేరుకున్నారు.
సరిగ్గా 03.50 కు సిరిమాను పై అమ్మ వారి రూపంలో పూజారి కూర్చున్నారు.
*తొలి సారి దేవాలయం నుంచీ కిట గుమ్మం వరకు బయలుదేరిన సిరిమాను
*దాదాపు గంట సమయం పట్టింది.
*ఇలా మూడు సార్లు సిరిమాను రథం..దేవాలయం నుంచీ కోట గుమ్మం వరకు తిరిగింది.
*డీసీసీబీ బ్యాంకు వద్ద నుంచీ డిప్యూటీ సీఎం పాము ల పుష్ప శ్రీవాణి, మంత్రులు బొత్స ,ముత్యం శెట్టి ,ఎమ్మెల్యే కోలగట్ల ,ఎంఎల్సీ సూర్యనారాయణ లు సిరిమాను సంబరం తిలకించారు.
*కోట బురుజు వద్ద నుంచీ పూసపాటి వంశీయుల అశోకగజపతి కుటుంబ సభ్యులు తిలకించారు.
*03.50 బయలుదేరిన సిరిమాను సంబరం… పూర్తయ్యేసరికి రమారమి 05.30 అయ్యింది.
* సిరిమాను రథం తిరిగే సమయంలో రెండు సార్లు మాత్రమే ఎస్పీ దీపికా, కలెక్టర్ సూర్యకుమారి నడిచారు.
*సాయంత్రం 04.45 అయ్యేసరికి ఆకాశం మేఘావృతంగా మారింది.
* ఏఆర్ డీఎస్పీ శేషాద్రి ఆధ్వర్యంలో హుకుంపేట నుంచీ సిరిమాను దేవాలయం వద్దకు చేరింది.
*దేవాలయం వద్ద పీటీసీ డీఎస్పీ వెంకట అప్పారావు నేతృత్వంలో సిరిమాను రధం సిద్ధమైంది.
*ఈ సారి పదిమంది రోబో బందోబస్తు తో ఎస్పీకి రక్షణ కవచంగా ఉన్నారు.
*అలాగే హై స్పీడ్ కెమారాలతో పాల్కన్ మొబైల్ ర్యాండ్ వెహికల్ బందోబస్తు గా ఉంచారు.
*మంత్రులు వెల్లంపల్లి ,ముత్యం శెట్టి ,బొత్స సత్యనారాయణ, పాముల పుష్ప శ్రీవాణి లు ఉండటం విశేషం.
*సిరిమాను సంబరం జరుగుతున్న సేపు వీఎంసీ పీఆర్వో ఆడియో యాంకర్ గ వ్యవహరించారు.
* పాత కలెక్టర్, దేవాదాయ శాఖ కమిషనర్ డా.హరిజవహర్ లాల్ పంచకట్టుతో ప్రత్యేక ఆకర్షణ గ నిలిచారు. ప్రతీ ఒక్కరూ ఆయనతో సెల్ఫీకోసం ఎగబడటం కనిపించింది.
*చివరి గా సిరిమాను.. కోట వద్ద నుంచీ రావడంతో ఆ సమయంలో కలెక్టర్, ఎస్పీ లు తిరిగారు.
*ఆఖరి సారి రథం తిరిగే సమయంలో వర్షం పడింది.
* పోలీసు సిబ్బంది తడుస్తూనే బందోబస్తును ఓఎస్డీ సూర్య చంద్రరావు నేతృత్వంలో వ్యవహరించారు.
*మొత్తానికి సిరిమాను సంబరం ముగిసింది.