కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారం డివిజన్ చంద్రగిరి నగర్ కు చెందిన యూత్ నాయకుడు సాయిరాజ్ ఆధ్వర్యంలో దాదాపు 200 పైగా యువకులు కాంగ్రెస్ పార్టీ కూన శ్రీశైలం గౌడ్ సమక్షంలో చేరారు.
శ్రీశైలం గౌడ్ వారికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం నిరుద్యోగులైన యువతీ యువకుల అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తానని అధికారంలోకి వచ్చి యువకులను గాలికొదిలేశారని అన్నారు.
యువకులంతా కూడా టిఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని జిహెచ్ఎంసి ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయకుండా చేతి గుర్తుకు ఓటు వేసి సోదరుడు కూన శ్రీనివాస్ గౌడ్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని యువతను కోరారు.