30.7 C
Hyderabad
April 29, 2024 03: 27 AM
Slider జాతీయం

కోహ్లీ రెస్టారెంట్లో స్వలింగ సంపర్కులకు నో ఎంట్రీపై వివాదం

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి చెందిన హోటల్ చైన్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. స్వలింగ సంపర్కుల పట్ల హోటల్ యాజమాన్యం వివక్షను ప్రదర్శించిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పూణేలోని కోహ్లీకి చెందిన వన్8 కమ్యూన్ అనే రెస్టారెంట్ స్వలింగ సంపర్కులకు ప్రవేశాన్ని నిరాకరించిందన్న ఆరోపణలపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. సమాజంలో అందరూ ఒకటేనని గతంలో సుప్రీం కోర్టే తెలిపిందని.. అయినప్పటికీ.. హోటల్ యాజమాన్యం వారి ప్రవేశాన్ని అడ్డుకోవడం హక్కులను ఉల్లంఘించినట్లేనని నెటిజన్లు మండిపడుతున్నారు.

కోహ్లీకి చెందిన ఇతర రెస్టారెండ్ బ్రాంచ్ లల్లోనూ స్వలింగ సంపర్కులకు ప్రవేశంపై నిషేధాన్ని అమలు చేస్తున్నారని.. దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా కోహ్లీని టార్గెట్ చేస్తూ పలు కామెంట్లు చేస్తున్నారు.

Related posts

జగన్ తో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి రహస్య సమావేశం

Satyam NEWS

పంట నష్టం పరిశీలించిన ఎమ్మెల్యే సీతక్క

Satyam NEWS

ప్రధాన పర్యటన లో నిరసనకారులు ఘటనలో కాంగ్రెస్ కుట్ర

Satyam NEWS

Leave a Comment