ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నేడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నక్లెస్ రోడ్డులో సైకిలింగ్, వాకింగ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా గత పక్షం రోజుల్లో యోగా తరగతులు నిర్వహించారు. అదే విధంగా జుంబా క్లాసులు కూడా ఏర్పాటు చేశారు.
కరోనా వ్యాధి తీవ్రత తగ్గి క్రమంగా ప్రజానీకం సాధారణ స్థితికి వస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని ఈ సందర్భంగా చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ కోరారు. ప్రతి ఒక్కరూ యోగా, నడక, ఎయిరోబిక్స్, సైక్లింగ్ చేయాలని అమిత్ జింగ్రాన్ కోరారు.