ప్రకాశం జిల్లా, హనుమంతునిపాడు మండలం, దాసరిపల్లె గ్రామం అంబేద్కర్ నగర్ లో “పల్లెపల్లెకు అంబేద్కర్” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పులే అంబేడ్కర్ మహాజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూతలపాటి రాజు హాజరయ్యారు.
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చరిత్ర, రాజ్యాంగ విలువలు, మహిళల హక్కుల గురించి రాజ్యాధికారం ఆవశ్యకత గురించి ప్రజలకు బోధించారు. ముఖ్యంగా విద్యార్థులకు చదువు విలువ గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ,ఎస్టీ,బిసి, మైనారిటీల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతగుంట్ల బాబు, పూలే అంబేద్కర్ మహజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూతలపాటి రాజు, సమాఖ్యా జిల్లా నాయకులు నూతలపాటి చెన్నకేశవులు, సమాఖ్య మార్కాపురం మండల నాయకులు దాసరి సునీల్, చింతగుంట్ల వెంకటేశ్వర్లు, గ్రామ ప్రజలు,మహిళలు విద్యార్థిని, విద్యార్థులు యువతీ యువకులు పాల్గొన్నారు.