సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని తిలక్ నగర్ కు చెందిన కుడితొట్టి నాగార్జున కొద్ది రోజుల క్రితం చెట్టుపై నుంచి క్రిందపడి నడుము విరిగి ఇబ్బందులు పడుతున్నారు. పేద కుటుంబం అయినందున ఆపరేషన్ కోసం చాలా ఖర్చుపెట్టి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తిలక్ నగర్ అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షుడు కోల్లపూడి యోహాన్ ఆదివారం తన కుటుంబం తరఫున కొంత నగదును నాగార్జున కుటుంబానికి అందించారు.
ఏసుక్రీస్తు సిలువ వేయబడి మూడవ రోజున మృత్యుంజయుడై లేచిన ఈస్టర్ శుభ సందర్భంగా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయించినట్లు యోహాన్ తెలిపారు. ఈ సందర్భంగా కోల్లపూడి యోహాన్ మాట్లాడుతూ అనారోగ్యంతో ఆర్ధికంగా బాధపడుతున్న కుడితొట్టి నాగార్జున కుటుంబానికి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం అందించి, ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుమ్మకొమ్ము రోజమ్మ,కోల్లపూడి శ్యామ్,కుడితొట్టి ఇర్మియ,కోల్లపూడి జ్యోతి కుమారి, కోల్లపూడి శ్రీవిద్య,కోల్లపూడి విక్రమ్, కుడితొట్టి సునంద,కోల్లపూడి మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్