నేపాల్ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ త్వరలో భారత్లో పర్యటిస్తానని వెల్లడించారు. 68 ఏళ్ల CPN-మావోయిస్ట్ సెంటర్ నాయకుడు డిసెంబర్ 26న మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. విశ్వాస ఓటింగ్లో గెలిచిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ “నేను త్వరలో భారతదేశాన్ని సందర్శిస్తాను” అని వెల్లడించారు. భారత్ వస్తే ఇదే ఆయన తొలి విదేశీ పర్యటన అవుతుంది. ఇందుకోసం దౌత్య స్థాయిలో సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. ప్రధాని అధికారిక నివాసం బలువతార్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, “సంబంధిత రాయబార కార్యాలయాలు నా పర్యటనకు సన్నాహాలు చేస్తున్నాయి అని అన్నారు.
previous post