40.2 C
Hyderabad
May 5, 2024 18: 02 PM
Slider వరంగల్

గ్రామాల్లో ప్రగతిని సాధించడమే పల్లె ప్రగతి లక్ష్యం

#sakinala bhavani

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభించారని ములుగు మండల జడ్పీటిసి సకినాల భవాని అన్నారు.

ఈ రోజు బండారుపల్లి, జంగాలపల్లి గ్రామాలలో నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమం ఆ గ్రామాల సర్పంచ్ అధ్యక్షతన జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సకినాల భవాని మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధి పనుల వైపు అడుగు వేయిస్తుందని అన్నారు.

పారిశుద్ధ్యం,పచ్చదనంతో పాటుగా ఆరోగ్య తెలంగాణ నిర్మించాలనే ఉద్దేశంతో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలని తెలిపారు.

పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతుందని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో బండారుపల్లి, జంగాలపల్లి సర్పంచ్ లు అక్కల రఘు, మస్రగాని అనిత రాణి,స్పెషల్ ఆఫీసర్ నవత,ఆర్ డి ఓ రమాదేవి, ఎమ్మార్వో సత్యనారాయణ,ఉప సర్పంచ్ మహేందర్,వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Related posts

ఈ సారి పులివెందులలో జగన్ కు కష్టమే…

Satyam NEWS

దళితుల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్న కొల్లాపూర్ ఎస్సై

Satyam NEWS

సాయంసంధ్య వేళ…విహరించిన విజయనగరం పైడతల్లి

Satyam NEWS

Leave a Comment