ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నిర్వహ ణకు సంబంధించి హైకోర్టు గురువారం తీర్పు వెలువరించనుంది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఈ నెల 8 వ తేదీన ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ను సస్పెండ్ చేస్తూ ఈ నెల 11 న సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే .
ఆ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ ముందు రాష్ట్ర ఎన్నికల సంఘం ( ఎస్ఈసీ ) అప్పీల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ తో కూడిన ధర్మాసనం ముందు మంగళవారం వాదనలు ముగిశాయి. వాదనలు విని తీర్పును వాయిదా వేసిన ధర్మాసనం గురువారం తీర్పును ప్రకటించనుంది.