ఉత్తరాంధ్ర ఇలవేల్పు, విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలకు అంకురార్పణ జరిగింది. నగరంలో ని మూడు లాంతర్ల చదురగుడి వద్ద ఉన్న పైడితల్లి దేవాలయం లో పైడితల్లి అమ్మవారి దీక్ష ప్రారంభం కూడా ప్రారంభమైంది. ఉదయం 08.గంటలకు దేవాలయం లో దాదాపు 80కి పైగా పైడితల్లి అమ్మ వారి దీక్ష ను ప్రారంభించారు. వచ్చే నెల 14 వరకు ఈ దీక్ష చేపట్టనున్నారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రముఖ పురోహితులు, ఆలయ అర్చకులు తాతా రాజేష్ ,అలాగే దూసి లక్ష్మణరావు ఆధ్వర్యంలో పైడితల్లి సిరిమాను అధిరోహిత బంటుపట్లి వెంకటరావుకు తొలుత దీక్ష ధారణ చేయించారు. అనంతరం 09 గంటలకు.. ఆలయం వెలుపల…. పందిర్రాట కార్యక్రమంలో వైభవోపేతంగా జరిగింది. దేవాదాయ కమీషనర్ సుధారాణి సమక్షంలో పందిర్రాట జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకుల తో పాటు కమీషనర్, సిరిమాను అధిరోహితలు మీడియా తో మాట్లాడారు.