సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో గురువారం కార్యవర్గ సమావేశం అధ్యక్షుడు యరగాని శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగినది. ఈ సందర్భంగా ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడు శ్రీనివాస గౌడ్ మాట్లాడుతూ సంఘం నుండి స్వల్పకాలిక,దీర్ఘకాళిక వ్యవసాయ పంట ఋణములు పొందిన రైతులు సకాలములో వాయిదా లోపు చెల్లించి రెన్యువల్ చేసుకొన్న వారికి 7% శాతం వడ్డీ,అలా చెల్లించిన రైతులకు మాత్రమే వడ్డీ రిబేటు,వడ్డీ రాయితీ లభిస్తుందని తెలిపారు.
వాయిదా మీరిన తేదీ నుండి వడ్డీ రిబేటు,వడ్డీ రాయితీ లభించక పోగా 13% శాతం అపరాదపు వడ్డీతో చెల్లించ వలసి ఉన్నందున రైతులు సకాలంలో ఋణాలను రెన్యూవల్ చేసుకోవాలని కోరారు. రైతులకు సంఘం నందు ఎరువులు,పురుగు మందులు అందుబాటులో ఉన్నాయని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు కె. మధుసూదన్ రెడ్డి, డైరెక్టర్లు గోసుల శ్రీను, రాయల వెంకటేశ్వర్లు, మీసాల శ్యామ్ సుందర్, కటారు శ్రీను,దుగ్గి బ్రహ్మం, దేవరం మల్లీశ్వరి,భూక్యా లచ్చీరామ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్