అనంతపురం జిల్లా రాప్తాడు ప్రాంతంలో సఖ్యతగా ఉన్న ప్రజల మధ్య మద్దెలచెరువు సూరి తమ్ముడు గంగుల సుధీర్ రెడ్డి తగాదాలు పెడుతున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత వ్యాఖ్యానించారు. గతంలో తాము చేసిన అభివృద్ధిని ఓర్వలేకే శిలాఫలకాలు ధ్వంసం చేస్తున్నారని సునీత దుయ్యబట్టారు.
శిలాఫలకాల ధ్వంసంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని ఆమె ఆరోపించారు. రాప్తాడు నియోజకవర్గంలో ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత ఆరోపించారు.