ప్రాజెక్టులను సందర్శిస్తే కెసిఆర్ కు వచ్చిన నష్టం ఏంటి? కెసిఆర్ తప్పులు బయట పడతాయి అనే భయంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసిందని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి కుక్కల వెంకన్న అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను, అక్రమాలను, దోపిడీని బయట పెట్టేంత వరకు మా పోరాటం ఆగదని, ప్రజా క్షేత్రంలో బయట పెడతాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో అందరం ముందుకు పోదాం అని పిలుపునిచ్చారు.