ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న కరోనా కేసుల్లో ఒక మంత్రి సోదరుడి కుటుంబం కూడా చేరింది. ఆ కుటుంబంలో ముగ్గురుకి కరోనా సోకింది. మంత్రి మేనత్త ఇటీవలే కన్నుమూశారు. ఆమెకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో కుటుంబసభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించారు.
మంత్రి సోదరుడు సహా ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో వారిని ఒక పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లో ఉంచారు. కరోనా పరీక్షలు చేయించుకున్న ఇతరుల్లో మంత్రి పీఏ, ఫొటోగ్రాఫర్ తదితరులు ఉన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండలో 17 మందికి వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు కలవరపడుతున్నారు.