నల్లకుంట డివిజన్ టీఆర్టీ క్వార్టర్స్ లోని మోతి నాగేశ్వరరావు పార్కులో 48 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఈరోజు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కార్పొరేటర్ అమృత తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అంబర్ పేట నియోజకవర్గంలోని అన్ని పార్కులను దశల వారీగా అభివృద్ధి చేస్తున్నామని, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా పార్కుల్లో సుందరీకరణ పనులు, అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.
అందులో భాగంగా పార్కుల్లో వృద్ధులు, మహిళలు కూర్చునేందుకు బెంచీలు, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం , పార్కు చుట్టూ ప్రహరీ గోడ నిర్మించడం, టైల్స్ మరియు పెయింటింగ్ వేయడం, వివిధ రకాల మొక్కలు నాటడం, పార్కు ముందు భాగంలో ఆర్చ్ నిర్మాణం వంటి అనేక పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
అలాగే మోతి నాగేశ్వరరావు పార్కులో చేపట్టనున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నిర్ణీత గడువులోగా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండిఏ డీఈ దేవేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ ఈఈ శంకర్, డీసీ వేణుగోపాల్, డీఈ సువర్ణ, ఏఈ దివ్య, వాటర్ వర్క్స్ ఏఈ రోహిత్, ఎలక్ట్రికల్ ఏఈ సౌమ్య, ఎఎంహెచ్ఓ జ్యోతిబాయి, హార్టీకల్చర్ డీఈ పేరిరాజు, మేనేజర్ భాస్కర్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు మేడి ప్రసాద్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట