ములుగు జిల్లా పసర సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న సబ్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ రావు నేడు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ ను కలిశారు.
ఎస్పీని కలిసిన ఆయన పుష్పగుచ్చం అందించారు. కరుణాకర్ రావు 2012 సంవత్సరం లో సబ్ ఇన్స్పెక్టర్ గా పోలీస్ శాఖ లో చేరారు. తొర్రూరు, సుబేదారి, తాడువాయి, పర్వతగిరి, ఎస్ ఐ బి, దేవరుప్పుల లో సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించారు.
తాజాగా పసర సబ్ ఇన్స్పెక్టర్ గా బదిలీపై వచ్చారు. సందర్భంగా జిల్లా ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని ఆదేశించారు.
విధి నిర్వహణలో అంకితభావం ప్రదర్శిస్తూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని సూచించారు.