భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ (UIDAI) హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయానికి డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా పి.సంగీత నియమితులయ్యారు.
పి.సంగీత 2004బ్యాచ్ కి చెందిన IAS అధికారిణి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలు, అండమాన్-నికోబార్ దీవులకు సంబంధించిన ఆధార్ సంబంధిత వ్యవహారాలను పి.సంగీత పర్యవేక్షిస్తారని భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ (UIDAI) ఒక ప్రకటనలో తెలిపింది.