40.2 C
Hyderabad
May 2, 2024 15: 07 PM
Slider నల్గొండ

మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలి

#TRS Hujurnagar

ఈనెల 29న హుజూర్ నగర్ పట్టణంలో RDO కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న రాష్ట్ర మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని హుజూర్ నగర్ పట్టణ టి‌ఆర్‌ఎస్ అధ్యక్షుడు చిట్యాల అమరనాధ్ రెడ్డి కోరారు. 

శనివారం టి‌ఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పట్టణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ హుజూర్ నగర్ రెవిన్యూ డివిజన్ ఏర్పాటుతో నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని, రెవెన్యూ డివిజన్  ఏర్పాటు చేసినందుకు సి‌ఎం కే‌సి‌ఆర్ కి, తోడ్పాటు అందించిన మంత్రి కే‌టి‌ఆర్ కి,మంత్రి జగదీష్ రెడ్డికి, శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

భవిష్యత్తులో  నియోజకవర్గంలో జరిగే  అభివృద్ధిలో MLA వెంట ఉండి, తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ పర్యటన కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పట్టణ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్, ఉపాధ్యక్షుడు బుచ్చిబాబు, శీలం శ్రీను, రామిశెట్టి రాము, కార్యదర్శులు శిల్పా శ్రీను, మీసాల శరత్ , పట్టణ కమిటీ కార్యవర్గ సభ్యులు పులిపాటి నరసింహారావు, పారేపల్లి నరసింహారావు, కొండేటి శ్రీను, డా. జిలెంధర్, శిగ్యం శ్రీను, మున్నా, ఒర్సు వెంకన్న, దగ్గుల నరేష్ యాదవ్, ఇట్టిమళ్ళ మధు తదితరులు పాల్గొన్నారు.

Related posts

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్

Satyam NEWS

కరోనా విజృంభిస్తోంది అందరూ జాగ్రత్త

Satyam NEWS

హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపు

Satyam NEWS

Leave a Comment