వాతావరణ పరిస్థితులు మారుతున్న దృష్ట్యా కరోనా మహమ్మారి రోజురోజుకు పెరిగిపోతుంది. గురువారం మండల కేంద్రంలోని పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది గ్రామంలో పర్యటించి కరోనా వ్యాధి పై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఇటీవల గణేష్ ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన శాంతి సమావేశంలో పాల్గొన్న బైంసా కౌన్సిలర్లు ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీనితో అప్రమత్తమైన పోలీస్ శాఖ గురువారం కుబీర్ లోని పలు ఇళ్లల్లో శానిటైజర్ చేసి అక్కడి ప్రజలకు పలు సూచనలు చేశారు.
అందరూ నియమ నిబంధనలు పాటించాలని గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు.