29.7 C
Hyderabad
May 3, 2024 04: 28 AM
Slider మహబూబ్ నగర్

ఫోన్ కొనివ్వలేదని తల్లిని హత్యచేసిన కొడుకు

son killed mother for not buying phone

మొబైల్ ఫోన్ కొనివ్వాలంటూ తల్లితో గొడవ పడిన కుమారుడు,  నిరాకరించిందన్న కోపంతో దారుణంగా హతమార్చాడు.  జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం శేరిపల్లి గ్రామంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన లక్ష్మి (52), వెంకటేశ్వర్ల దంపతుల పెద్ద కుమారుడు మహేశ్ ఇంటర్ పూర్తిచేసి కూలిపనులు చేస్తున్నాడు. తనకు సెల్‌ఫోన్ కొనివ్వాలంటూ గత కొంతకాలంగా తల్లితో గొడవపడుతున్నాడు. డబ్బులు లేవని, తర్వాత చూద్దామని తల్లి చెప్పింది. 

సెల్‌ఫోన్ కోసం  మరోమారు తల్లీకొడుకుల మధ్య వాగ్వివాదం జరిగింది. అది మరింత ముదరడంతో ఆగ్రహంతో విచక్షణ కోల్పోయిన మహేశ్ రోకలిబండతో తల్లి తలపై బలంగా మోదాడు. తీవ్రంగా గాయపడిన ఆమె కిందపడింది. చుట్టుపక్కల వారు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే, అది వచ్చేసరికే లక్ష్మి ప్రాణాలు కోల్పోయింది. ఆమె అక్క దేవమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

అభివృద్ధి పథంలో హుజుర్ నగర్ నియోజకవర్గం

Satyam NEWS

బిఆర్ఎస్ కు బుల్లెట్ దిగింది: మెగారెడ్డి                                                                            

Satyam NEWS

19 నుండి మున్నూరు కాపు చైతన్య యాత్ర

Murali Krishna

Leave a Comment