మంగళవారం వనపర్తి జిల్లా పెద్దమందడి పోలీస్ స్టేషన్ ను జిల్లా యస్.పి. రక్షితమూర్తి.కె ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ లొ నమోదైన కేసులు, పెండింగ్ కేసులు, నేరస్థుల అరెస్ట్ కోసం పెండింగ్ కేసులు, స్టేషన్ రికార్డ్స్ తదితర విషయాలను యస్.ఐ. హరి ప్రసాద్ ని అడిగి తెలుసుకున్నారు. పరిశీలనలో రికార్డ్స్ నిర్వహణ, కేసులలో విచారణ సరిగ్గా చేపట్టనందున యస్.ఐ. హరి ప్రసాద్ కు ఛార్జ్ మెమో జారీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పారదర్శకంగా విచారణ చేపట్టి ప్రజలకు భరొసా కల్పించాలని, భాదితుల సమస్యలు తెలుసుకొని పరిష్కారంనకు కృషి చేయాలని ఆదేశించారు. విధులను భాద్యతగా నిర్వర్తించాలని, పోలిస్ స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్