న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక వ్యక్తిని ఎట్టకేలకు అరెస్టు చేశారు.
కడప జిల్లాకు చెందిన లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై తీవ్ర ఆరోపణలు చేశాడు.
దీనిపై హైకోర్టు సుమోటోగా కేసు స్వీకరించి సీబీఐకి దర్యాప్తు కోసం అప్పగించింది. సీబీఐ దర్యాప్తు చేసి రాజశేఖర్ రెడ్డిని అరెస్టు చేసింది.
అరెస్టు చేసిన రాజశేఖర్ రెడ్డిని గుంటూరు సివిల్ కోర్టులో హాజరు పరిచారు.
రాజశేఖర్ రెడ్డికి ఈ నెల 23 వరకు రిమాండ్ విధించారు. దాంతో ఆయనను జిల్లా జైలుకు తరలించారు.