ప్రజల సహకారంతో జిల్లాలో శాంతిభద్రతలు నెలకొల్పుతామని గద్వాల జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రంజన్ రతన్ కుమార్ అన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల నెలకొల్పడం ప్రజల బాధ్యత కూడా ఉందని ఆయన తెలిపారు.
జిల్లాలో నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలందరూ మా స్కూలు ధరించాలని సామాజిక దూరం పాటించాలని సూచించారు.
గద్వాల పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి గ్రామాలకు వచ్చే వలస కూలీలు ఎవరైనా ఉంటే సమాచారం ఇవ్వాలని ఎస్పి తెలిపారు. ఈ సమావేశంలో ఏ ఎస్ పి కృష్ణ తదితరులు పాల్గొన్నారు