33.7 C
Hyderabad
April 29, 2024 00: 25 AM
Slider ఆంధ్రప్రదేశ్

సీఎం జగన్ పేషీ అధికారి డ్రైవర్ కు కరోనా

#YSJaganmohanReddy

ఏపీ సీఎం వైఎస్ జగన్ పేషీలో పనిచేసే ఒక అధికారి డ్రైవర్ కి కరోనా పాజిటివ్ వచ్చింది. అతనితో బాటు మరో  ఐదుగురికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో సచివాలయ సిబ్బంది ఆందోళనకు గురి అవుతున్నారు. ఇప్పటి వరకు మొత్తంగా ఏపీ సచివాలయంలో 10 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

తాజాగా పొరుగు సేవల ద్వారా కమాండ్ కంట్రోల్‌లో పనిచేసే ఒక ఉద్యోగికి కరోనా పాజిటీవ్ వచ్చింది. ప్రణాళిక విభాగం‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తి కి కరోనా పాజిటివ్ వచ్చింది. అదే విధంగా పరిశ్రమల శాఖలో పనిచేసే మరో ఉద్యోగి కి కూడా కరోనా నిర్ధారణ అయింది.

సీఎం బ్లాక్‌లో ఆర్‌టీజీఎ‌స్‌లో పనిచేసే సర్వీస్ ప్రొవైడర్‌కు, సీఎం పేషీలో పనిచేసే అధికారి డ్రైవర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. విద్యాశాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు కరోనా నిర్ధారణ అయింది.

Related posts

కడపలో ఉన్నారా? మీకు కరోనా వస్తే ఇక అంతే…..

Satyam NEWS

ఆశ్రమ పాఠశాలల మౌలిక వసతుల పనులు పూర్తి చేయండి

Satyam NEWS

రూ.2 కోట్లతో నిమ్స్ లో అధునాతన పరికరాలు

Bhavani

Leave a Comment