అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనకు జరిపిన స్వాబ్ టెస్టులో భిన్నమైన ఫలితాలు వెలువడ్డాయి.
సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేసిన టెస్టులో ఒకసారి నెగటివ్ రాగా మరో సారి చేసిన పరీక్షలో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పాజిటీవ్ గా రావడంతో ఆయన ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు.