42.2 C
Hyderabad
April 26, 2024 17: 13 PM
Slider కరీంనగర్

వినూత్నంగా మంత్రి గంగుల  కమలాకర్ దీపావళి వేడుకలు

#ministergangula

మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురంలో స్థానిక శ్రేణులు, ప్రజలతో కలిసి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ దీపావళి వేడుకల్ని జరుపుకున్నారు. గత మూడేళ్లుగా కాంగ్రెస్ నుండి గెలిచి బిజెపికి కోవర్టుగా మూడేళ్లుగా పనిచేస్తూ అమ్ముడుపోయి స్వార్థంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెచ్చుకున్న 18 వేల కోట్ల కాంట్రాక్టులు మునుగోడు ప్రజలు పేల్చివేయబోతున్నారని సింబాలిగ్గా మంత్రి గంగుల 18000 వాలాను స్థానికులతో కలిసి కాల్చారు. నరకాసుర వద జరిగి వెలుగులు విరజిమ్మే దానికి గుర్తుగా వినూత్నంగా నిర్వహించిన ఈ వేడుకలలో స్థానికులు పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల మధ్య పాల్గొన్నారు. చెడుపై మంచి గెలిచే దీపావళి పర్వదిన సందర్భంగా మునుగోడులో సైతం మంచి విజయం సాధించడం తద్యమని, కెసిఆర్ నాయకత్వంలో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నామన్నారు.

ధరాసురులుగా మారిన బిజెపి ప్రభుత్వ వైఖరులను మంత్రి గంగుల ఎండ కట్టారు, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం, సామాన్యుల వస్తు సేవలన్నిటిపై జీఎస్టీలను పెంచడం, ధరల్లో సామాన్యులను ముంచడమే ఆ పార్టీ విధానం అని దుయ్యబట్టారు. మునుగోడు ప్రజలు చైతన్యంతో ఈ దరాసులను తిప్పి కొట్టడమే కాకుండా అభివృద్ధి, సంక్షేమం అందజేస్తున్న కెసిఆర్ సర్కార్ కు సంపూర్ణంగా అండగా ఉంటారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికలలో మునుగోడు గడ్డపై ఎగిరేది గులాబీ జెండా అన్నారు మంత్రి గంగుల. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, ఫాక్స్ చైర్మన్ జక్కిడి జంగారెడ్డి, సీనియర్ నాయకులు ప్రేమ్చంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క

Satyam NEWS

అధికారం కోసం ఆరాటం లేదు… అందుకు పోరాటం లేదు

Satyam NEWS

సరదాగా ఇంతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి

Satyam NEWS

Leave a Comment