29.7 C
Hyderabad
May 2, 2024 03: 17 AM
Slider నల్గొండ

వార్డుల వారీగా ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం

#ArchnaGelli

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చన రవి ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు.

నేడు నాలుగు, అయిదు వార్డులలో ఆ వార్డుల కౌన్సిలర్లు  ఓరుగంటి నాగేశ్వర రావు, దొంగరి మంగమ్మ, అధికారులతో కలిసి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా అర్చన రవి మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల లోని సమస్యలను ఆ వార్డులోనే  అవగాహన చేసుకొని పరిష్కరించేందుకు అధికారులతో కలిసి పర్యటిస్తున్నామని అన్నారు.

పట్టణం లోని అన్ని వార్డులను సమగ్ర అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. ఆయా వార్డులలో జరుగుతున్న అభివృద్ధి పనులను కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, మున్సిపల్ కమీషనర్ నరేశ్ రెడ్డి ,శానిటరీ ఇన్స్పెక్టర్ జానకిరెడ్డి,పలువురు నాయకులు ,మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

జాతీయ జెండాపై మంత్రి వ్యాఖ్యలతో రణరంగంగా కర్నాటక అసెంబ్లీ

Satyam NEWS

తిమ్మాపూర్ తిరుపతి క్షేత్రంలో బోటింగ్ ప్రారంభించిన స్పీకర్

Satyam NEWS

లాల్ బాగ్ శివాలయంలో మహా శివరాత్రి ఏర్పాట్లు

Satyam NEWS

Leave a Comment