సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చన రవి ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు.
నేడు నాలుగు, అయిదు వార్డులలో ఆ వార్డుల కౌన్సిలర్లు ఓరుగంటి నాగేశ్వర రావు, దొంగరి మంగమ్మ, అధికారులతో కలిసి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అర్చన రవి మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల లోని సమస్యలను ఆ వార్డులోనే అవగాహన చేసుకొని పరిష్కరించేందుకు అధికారులతో కలిసి పర్యటిస్తున్నామని అన్నారు.
పట్టణం లోని అన్ని వార్డులను సమగ్ర అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. ఆయా వార్డులలో జరుగుతున్న అభివృద్ధి పనులను కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, మున్సిపల్ కమీషనర్ నరేశ్ రెడ్డి ,శానిటరీ ఇన్స్పెక్టర్ జానకిరెడ్డి,పలువురు నాయకులు ,మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.