నిర్మల్ జిల్లా లోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవస్థానం కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నది. సరస్వతీ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతిరోజు శానిటేషన్ పనులను కచ్చితంగా చేపడుతున్నారు. ఈ మేరకు ఆలయ ఇవో దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు.
ఇవో ఆదేశాలను అనుసరించి క్యూ లైన్లను, మండపాలలో, గచ్చుల పైనా, ఆలయ చుట్టు పక్కల ప్రాంతాలలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో శుభ్రం చేస్తున్నారు. ఆలయములో పని చేసే వాగ్దేవి లేబర్ సొసైటీ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటున్నారు.
ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర శానిటైజర్లను ఉపయోగిస్తున్న ఆలయ సెక్యూరిటీ హోమ్ గార్డ్ సిబ్బంది భక్తులను ముందుగానే పరీక్షిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో వెల్లడించారు.