27.7 C
Hyderabad
April 30, 2024 07: 05 AM
Slider ముఖ్యంశాలు

జేఈఈ తొలివిడతలో ఎస్సీ గురుకుల విద్యార్థుల ప్రతిభ

#Minister Merugu Nagarjuna

జేఈఈ తొలివిడత పరీక్షల్లో ఎస్సీ గురుకులాలకు చెందిన విద్యార్థులు కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా అద్భుతమైన ఫలితాలను సాధించారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. ఈ పరీక్షలు రాసిన 189 మంది విద్యార్థుల్లో 151 మంది జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించడంతో పాటుగా 93 మంది విద్యార్థులు ప్రస్తుతం సాధించిన ఫలితాలతోనే ఎన్ఐటీలలో సీట్లు పొందే అవకాశాన్ని దక్కించుకున్నారని వివరించారు.

ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని చిన్నటేకూరు (కర్నూలు జిల్లా), అడవి తక్కెళ్లపాడు (గుంటూరు జిల్లా), ఈడ్పుగల్లు (కృఫ్ణా జిల్లా)లలో జేఈఈ, నీట్ శిక్షణా కేంద్రాలు ఉండగా ఈ కేంద్రాల నుంచి ఈసారి మొత్తం 189 మంది విద్యార్థులు జేఈఈ పరీక్షలు రాసారని నాగార్జున గురువారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విద్యార్థులలో 151 మంది జేఈఈ అడ్వాన్స్ పరీక్షలకు అర్హతను సాధించారని చెప్పారు.

జేఈఈ తొలి విడత పరీక్షల్లో అరేక మంది ఎస్సీ విద్యార్థులు వివిధ సబ్జెక్టుల్లో 99.05 పర్సంటైల్ వరకూ మార్కులను సాధించారని చెప్పారు. అన్ని సబ్జెక్టుల్లోనూ ఓవరాల్ గా చిన్నటేకూరు శిక్షణా కేంద్రానికి చెందిన వరదా పవన్ కుమార్ 96.61, మల్లెపోగు అవన్ కుమార్ 95.49, రవణ కిరణ్ కుమార్ 95.39 పర్సంటైల్ ను సాధించగా, ఈడ్పుగల్లుకు చెందిన జి.మనోజ్ఞ 95.60, అడవి తక్కెళ్లపాడుకు చెందిన అజయ్ భార్గవ్ 93.63 పర్సంటైల్స్ సాధించి ఎస్సీ గురుకులాల్లో టాపర్స్ గా నిలిచారని వివరించారు.

ఎన్ఐటీ లలో సీట్లు సాధించడానికి అంచనా వేస్తున్న కటాఫ్ మార్కుల ప్రకారంగా తమ గురుకులాల నుంచి జేఈఈ అడ్వాన్స్ పరీక్షలకు అర్హత సాధించిన 151 మంది విద్యార్థులలో 93 మంది ప్రస్తుతం సాధించిన మార్కులతోనే సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నామని తెలిపారు. అయితే అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించిన విద్యార్థులలో కొందరు కొన్ని సబ్జెక్టుల్లోనే అత్యధిక మార్కులు సాధించగలాగారని, మరి కొన్ని సబ్జెక్టుల్లో వివిధ కారణాలతో మార్కులు తగ్గాయని కూడా తాము గుర్తించినట్లు నాగార్జున వెల్లడించారు.

ఈ విద్యార్థులు అందరూ రాసే జేఈఈ మలి విడత పరీక్షల్లో వారి లోపాలు సరిదిద్దుకొనేలా శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ విద్యార్థులందరూ ఎస్సీ రిజర్వేషన్ విభాగం నుంచి కాకుండా తమ ప్రతిభతో జనరల్ కేటగిరీలోనే సీట్లు పొందే అవసరమైన శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు చెప్పారు.

గతంలో తమ విద్యార్థులు జేఈఈ సరీక్షల్లో సాధించిన ఫలితాల కంటే ఈసారి ఫలితాలు మరింత మెరుగ్గా వచ్చాయని అభిప్రాయపడ్డారు. జేఈఈ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు, ఉత్తమ ఫలితాలను రాబట్టిన గురుకుల అధికారులు, అధ్యాపకులను ఈ సందర్భంగా మంత్రి నాగార్జున అభినందించారు.

Related posts

ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్లు కలసి కట్టుగా ఉండాలి

Satyam NEWS

వింత ఆచారం: అక్కడ పురుషులు ఏం చేశారో తెలుసా?

Satyam NEWS

నిషేధిత గంజాయి,గుట్కా కోసం కిరాణం షాపుల్లో ముమ్మర తనిఖీలు

Satyam NEWS

Leave a Comment