సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ గురుకుల మైనారిటీ పాఠశాలలో విజయీభవ ట్రస్ట్ కోదాడ వారి ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస కార్యక్రమం గురువారం జరిగింది. విద్యార్థులు వైఫల్యం కావటం సహజమని,అది ఓటమి కాదని,విజయంలో భాగమని భావించాలని, వైఫల్యం విజయానికి తొలిమెట్టు అని మానసిక వికాస నిపుణుడు చారుగుండ్ల రాజశేఖర్ అన్నారు. పరీక్షలు అనగానే భయం,ఆందోళన కలగటం సహజమని,దాన్ని అధిగమించాలని అన్నారు. భయం వీడితే విజయం తమదే అవుతుందని, ప్రణాళికా బద్ధంగా, శ్రద్దగా చదివితే విజయం సాధించటం సాధ్యమని చారుగుండ్ల రాజశేఖర్ విద్యార్ధుల్లో స్ఫూర్తి నింపారు.
విద్యార్థులు సాంకేతికతని పెంచుకొని, ఆంగ్ల భాష పట్ల పట్టు సాధించాలని, కమ్యూనికేషన్ బాగా పెంచుకోవటం ద్వారా వేగంగా పురోగతి సాధించవచ్చని అన్నారు. వైఫల్య గాథలు,మానసిక ప్రశాంతత, సమయపాలన,పుస్తకపఠనం, ఆత్మవిశ్వాసం,పరిపూర్ణతా సాధనా మార్గం,యోగ అనేక అంశాలను వివరించారు. అనంతరం రాజశేఖర్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, పాఠశాల ప్రిన్సిపాల్ రెహానా బేగం,ముఖ్య అతిధిగా మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరావు,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్