జగనన్నకు చెబుదాం అనే పనికిమాలిన కార్యక్రమంలో ఫోన్లు పలకడం లేదని అధికార వైసీపీ సీనియర్ నాయకుడు, నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ఎన్నో సార్లు ప్రయత్నించా కానీ ఫోన్ మాత్రం ఎంగేజ్ లోనే ఉన్నది అని ఆయన తెలిపారు.
నేను ఆంధ్రాకి వస్తే నీకు ఎందుకు గుండెల్లోదడ, అన్ని దొంగ కేసులు పెట్టిస్తున్నావు అని అడుగుదామని 1902 కొట్టాను అని ఆయన తెలిపారు. అయితే ఫోన్ మాత్రం ఎంగేజ్ లోనే ఉందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఫోన్ ఎంగేజ్ వస్తున్నదంటే ప్రోగ్రాం సూపర్ హిట్ అని సిగ్గు మాలిన కబుర్లు చెప్పించవచ్చు.
కానీ పరిస్థితి అలా లేదని ఆయన అన్నారు. నిజంగా ఫోన్లు ఎంగేజ్ వస్తున్నాయంటే ప్రజలకు చాల ఎక్కువ సమస్యలు ఈ రాజ్యంలో ఉన్నాయనుకుంటా ! కనీసం పదివేలమంది ఫోన్ లేపే వాళ్ళు లేకపోతే కష్టం జగనన్న. మూడు కోట్ల ఫోన్ కాల్స్ వస్తాయి. వాలంటీర్లను వాడుకో జగనన్నా అని ఆయన వ్యాఖ్యానించారు. తాను మాత్రమ మళ్లీ మళ్లీ ఫోన్ చేస్తూనే ఉంటానని, తాను ప్రస్తుతం నాగాలాండ్ లో ఉన్నానని ఆయన అన్నారు.