కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 9న నిర్వహించే జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు వ్యవసాయ కార్మిక రైతు సంఘం పిలుపునిచ్చింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్లచెరువు మండల కేంద్రంలో నేడు జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు.
ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వటైపు సైదులు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కే. వెంకన్న, రైతు సంఘం మండల నాయకులు శివ, వీరబాబు, రామారావు, నాగేశ్వరరావు, శంభయ్య, శీను తదితరులు పాల్గొన్నారు.