కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఎన్నికైన నీలి శ్రీనివాసరావు ను నేడు పులివెందుల నియోజకవర్గం ఇంచార్జ్ వేలూరు శ్రీనివాసులరెడ్డి సన్మానించారు.
కడప జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయనను కలిసి సన్మానించిన తర్వాత శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తనవంతు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తానని అన్నారు.
త్వరలో పులివెందుల పర్యటనకు రావాల్సిందిగా ఆహ్వానించారు. డిసిసి అధ్యక్షుడిని కలిసిన వారిలో నెర్రెడ్డి శంకర్ రెడ్డి, రామాంజనేయులు, కొపురి శ్రీనివాసులు, శ్రీకాంత్, వెంకటరామి రెడ్డి తదితరులు ఉన్నారు.