మంచినీటి సమస్యను పరిష్కరించాలని కేసీఆర్ నగర్, మల్లికార్జున్ నగర్ కాలనీ అధ్యక్షుడు దొమ్మాటి కిరణ్కుమార్ ఆధ్వర్యంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డికి వినతిపత్రం మంగళవారం అందజేశారు. కాప్రా సర్కిల్లోని కాప్రా డివిజన్ పరిదిలోని కేసీఆర్ నగర్, మల్లికార్జున్ నగర్ కాలనీలలో గత కొన్ని సవంత్సరాలుగా మంచినీటి కలెక్షన్ లు లేక ప్రజలు ఇబ్బంది పడుచున్నారు. జిహెచ్ఎమ్సి ఎలక్షన్లో మంచినీటి కలెక్షన్లు ఇప్పిస్థామని హామీ ఇచ్చారు కాని ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఎమ్మేల్యే బేతి సుభాష్రెడ్డి కాలనీ సమస్యలపై సానుకూలంగా స్పందించి ఎలక్షన్లలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం కేసీ నగర్,మల్లికార్జున్నగర్ ల అభివృద్దికి కట్టుబడి ఉన్నామని త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పోరేటర్ స్వర్ణరాజ్శివమణి, డివిజన్ అధ్యక్షులు మహేందర్రెడ్డి, రాజు,పరుశరాములు,సమ్మక్క,రవళి, లలిత, తదితరులు పాల్గొన్నారు.