రాష్ట్రంలో అఘాయిత్యాలు..అత్యాచారాలు పెరిగిపోతున్నాయని…అందుకు విరుగుడు అంటూ జగన్ ప్రభుత్వం పెట్టిందని ధిశ చట్టం అదే ఫేక్ అని అస్సలు దిశ చట్టమే లేదని..కేంద్ర మాజీ మంత్రి కూతురు, విజయనగరం టీడీపీ నియోజక వర్గ ఇంచార్చ్ అదితి గజపతిరాజు విమర్శించారు. ఒంగోలులో జరిగిన మహానాడు పాల్గొ్న్న ఆమె…అంతకు ముందు అక్కడి సభ విషయాలను మాట్లాడారు.
రెండు రోజుల పాటు జరిగిన మహానాడు ..గతంలో కన్నా ఎంతో ఉత్సాహంగా.. ఉల్లాసంగా జరిగిందిన్నారు. 2024లోజరగబోవు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో నారా చంద్రబాబునాయుడినే సీఎంగా చెయ్యడమే లక్ష్యంగా సాగిందన్నారు.జరిగిన మహానాడులో..జిల్లా పరంగా పేర్కొన్నతీర్మానాలపై సుదీర్ఘంగా చర్చ జరిగిందన్నారు.ఈ సీఎం జగన్..వైఎస్ఆర్సీపీ పూర్తిగా విఫలం అయ్యారని…సంక్షేమం కాని అబివృద్ది గాని ఏ ఒక్కటి అమలు జరగలేదని పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు.
అన్ని వర్గాల వారిని పూర్తిగా నట్టేట ముంచిందని…ప్రత్యేకించి రైతు భరోసా కేంద్రాలు పెట్టినా…ఒక్కరైతు స్వయం సమృద్దిగా ఎదిగలేదని ఆదితీ విమర్శించారు.ఇక ఆంధ్ర ప్రదేశ్ కాస్తా..నేరాంద్రప్రదేశ్ గామారిందని..మాన భంగాలు,అత్యాచారాలు పెరిగిపోయాయన్నారు. వీటిని నియంత్రండం కోసం ఇంత వరకు ఏ చట్టం అమలు జరగలేదు..అస్సలు తీసుకురాలేదన్నారు.
జగన్ ప్రభుత్వం పేర్కొన్న దిశ చట్టం..ఓ ఫేక్ చట్టం అని…కేవలం ప్రచారం కోసమే…జగన్ ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని ఆదితీ విమర్శించారు. రెండు రోజుల పాటు జరిగిన మహానాడులో…రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను కూలంకుషంగా చర్చించిడం జరిగిందని…టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని…చంద్రబాబు నాయడు సీఎం అవ్వటం కూడా ఖాయమని ఆమె స్పష్టం చేసారు.