దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 75 ప్రాజెక్టులను యూపీకి అంకితం చేస్తున్నారు. ఆజాదీ 75లో భాగంగా మోదీ ఈ రోజు లక్నోలో పర్యటిస్తారు. ఈ మేరకు 4737 కోట్ల విలువైన 75 ప్రాజెక్టులను కూడా ప్రారంభించనున్నారు. దీంతోపాటు 75వేల మంది లబ్ధిదారులకు పీఎం హౌసింగ్ స్కీమ్ కింద గృహాలను కేటాయించి లబ్ధిదారులతో సంభాషించనున్నారు.
దీంతోపాటు లక్నో, కాన్పూర్, వారణాసి, ప్రయాగరాజ్, గోరఖ్పూర్, ఝాన్సీ, ఘజియాబాద్తో సహా ఏడు నగరాల కోసం FAME-II కింద ఏర్పాటు చేసిన 75 బస్సులను కూడా ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. హౌసింగ్, అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ కింద 75 ప్రాజెక్టులకు సంబంధించిన కాఫీ టేబుల్ పుస్తకాన్ని కూడా ప్రధాని విడుదల చేయనున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ ఆజాదీ 75 కార్యక్రమం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.