31.7 C
Hyderabad
May 2, 2024 07: 30 AM
Slider జాతీయం

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దేశానికి ముప్పులా తయారయ్యాయి

#CPI

దేశానికి బీజేపీ ప్రమాదకారిగా తయారైందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ. రాజా అన్నారు. దేశ సార్వభౌమాధికారం ప్రమాదంలో పడిందని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ కలిసి దేశ మౌలిక వ్యవస్థల్నే మార్చాలని చూస్తున్నాయని అన్నారు. భారత దేశం ప్రస్తుతం అతిపెద్ద సంక్షోభంలో ఉందని అన్నారు.

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దేశానికి ముప్పుగా తయారయ్యాయని అన్నారు. గవర్నర్‌ వ్యవస్థను దుర్వినియోగం చేస్తుందని అన్నారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఢిల్లీలో ఏం జరుగుతుందో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారని అన్నారు.

తెలంగాణ పోరాట యోధులకు పుట్టినిల్లు అన్నారు. ప్రజలకు విద్య, వైద్యం, ఉద్యోగం కనీస అవసరాలని, ఈ రంగాల్లో తెలంగాణ ముందుందని కొనియాడారు. కరెంట్‌ కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రైతుబంధు, దళితబంధు లాంటి అద్భుత పథకాలను తెలంగాణ అమలు చేస్తుందని కొనియాడారు.

Related posts

ఎటాక్: కౌన్సిల్ ఛైర్ పర్సన్ షరీఫ్ మతాన్ని కించపరిచారు

Satyam NEWS

115V బస్ ను పునః ప్రారంభించిన కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్

Satyam NEWS

పశువుల తరలింపులో నిబంధనలు పాటించకుంటే చర్యలు

Satyam NEWS

Leave a Comment