38.2 C
Hyderabad
May 5, 2024 21: 57 PM
Slider హైదరాబాద్

చలో అసెంబ్లీకి బయలుదేరిన ఓయూ జేఏసీ నేతల అరెస్టు

#OU JAC

ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చలో అసెంబ్లీకి బయలుదేరిన ఓయూ జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

నిరుద్యోగుల పాలిట శాపంగా మారిన ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని,రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు విసిలను నియమించాలని ఈ సందర్భంగా అధ్యక్షుడు ఎల్చల దత్తాత్రేయ డిమాండ్ చేశారు.

వివిధ విద్యార్థి సంఘాల నాయకులు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వగా పోలీసులు అడ్డుకున్నారు. ఓయూ జేఏసీ, వివిధ విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

ఓయూ జేఏసీ అధ్యక్షుడు దత్తాత్రేయ మాట్లాడుతూ పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు రాష్ట్రవ్యాప్తంగా పోరాటం కొనసాగుతుందని అన్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు.

Related posts

సంక్షేమంతో బాటు ప్రాధాన్యతాక్రమంలో అభివృద్ధి పనులు

Satyam NEWS

జగనన్న ఇండ్ల పట్టాలు: అర్హతే ప్రామాణికం…మహిళకే ప్రాధాన్యం

Bhavani

ఫేమ్ స్కీమ్ తో ఆర్టీసీపై మెగా కబ్జా?

Satyam NEWS

Leave a Comment